Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీముఖిపై పోలీసు కేసు.. ఏం జరిగింది ?

- Advertisement -

ఈ మధ్య కాలంలో సినిమాల్లో, రియాల్టీ షోల్లో నటించే నటీనటులపై కామన్ అయిపోయింది. సినిమాలు, టైటిల్స్, డైలాగ్స్, పాటలు ఏదో ఒక ఒక్కటి చూపించి తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెడుతున్నారు. తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖిపై ఓ కేసు నమోదు అయింది. శ్రీముఖి బుల్లితెరపై ఎలాంటి హంగామా చేస్తుందో అందరికి తెలిసిందే.

ఆమె వేసే పంచులు, సెటైర్లు కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా శ్రీముఖి పటాస్ షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్ కి వెళ్ళాక ఈమె విన్నర్ అవుతుంది అనుకున్నారు. కానీ హౌస్ లో బాగా గొడవపడటంతో ఈమెపై నెగిటివ్ ప్రచారం జరిగి రన్నర్ గా నిలిచింది. అయినప్పటికి బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాధించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి బుల్లితెరపై పెద్దగా రాణించలేకపోతుంది. కొత్తగా ప్రారంభించిన షోల్లో కూడా శ్రీముఖి తేలిపోయింది.

ఓ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని కించ పరిచేలా ఉన్నాయని శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తామని తెలిపినట్టు సమాచారం. కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని యాంకర్ శ్రీముఖితో పాటు సదరు టీవీ యాజమాన్యంపైనా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -