Friday, March 29, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ అభిమానుల పై లాఠీ ఛార్జ్

- Advertisement -

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతున్న విజయ్ దేవరకొండ కి చేదు అనుభవం ఎదురయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కేవలం హీరో మాత్రమే కాదు ఒక పెద్ద స్టార్. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు కొత్త క్రేజ్ ని సంతరించుకుంటాయి. ఇప్పుడు డియర్ కామ్రేడ్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే.

అయితే బెంగళూరు లో ఒక ప్రమోషనల్ ఈవెంట్ ని ముగించుకొని కొచ్చి లో మ్యూజికల్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వెళ్లిన విజయ్ దేవరకొండ ని చూడటానికి అభిమానులు చాలా మంది వచ్చారు. అయితే వందల్లో వచ్చిన ఈ అభిమానులని అక్కడ కంట్రోల్ చేసినందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయగా, దీనికి బాధ పడిన అభిమానులు వెంటనే అక్కడ ధర్నా కి దిగారు.

విషయం తెలుసుకున్న విజయ్ వెంటనే బయటకు వెళ్లి అభిమానులను పలకరించబోయి, తనని చూడటానికి వందల్లో తరలి వచ్చిన అభిమానులని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. హైదరాబాద్ లో చెన్నై లో జరిగే ఈవెంట్స్ కి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని వెంటనే నిర్వాహకులకు సమాచారం ఇచ్చాడట విజయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -