Thursday, April 25, 2024
- Advertisement -

ఆ విష‌యంలో త‌ప్పు చేశాను క్ష‌మించండి – పూజా హెగ్డె

- Advertisement -

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారంటే అది ఖచ్చింత‌గా పూజా హెగ్డెనే అని చెప్పాలి. టాలీవుడ్‌లోని స్టార్ హీరోల‌తో వ‌రుసగా సినిమాలు చేస్తోంది పూజా హెగ్డె. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, బ‌న్ని, వంటి స్టార్ హీరోల‌తో న‌టించిన పూజా హెగ్డె రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఓ ఐటం సాంగ్‌లో క‌నిపించింది. పూజా హెగ్డె ప్ర‌స్తుతం మ‌హేశ్‌తో మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ కొత్త సినిమా, బ‌న్ని-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డెనే ఎంపిక చేశారు. అలాంటి పూజా హెగ్డె తాను త‌ప్పు చేశారు క్ష‌మించండి అంటూ కామెంట్ చేసింది.

ఇంత‌కి పూజా హెగ్డె అలా ఎందుకు చెప్పిందో తెలుసా..?. హీరోల‌తో పోలిస్తే హీరోయిన్లు స్పాన్ చాలా త‌క్కువ‌. కాని సినిమాలు మాత్రం హీరోల‌క‌న్నా హీరోలే ఎక్కువ చేస్తారు. హీరోయిన్లు సంవ‌త్సరానికి నాలుగు నుంచి ఐదు సినిమా చేస్తారు. పూజా హెగ్డె కెరీర్ మొద‌లుపెట్టి 7 సంవ‌త్పరాలు అయింది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె న‌టించింది మాత్రం కేవ‌లం 8 సినిమాలే. ఈమె కెరీర్ లో రెండు సంవత్సరాలు బాలీవుడ్ మొహెంజదారో చిత్రం కోసం వృదా చేసింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు జోడీగా ఆ చిత్రంలో నటించిన పూజా హెగ్డే సక్సెస్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విష‌యంలో త‌ప్పు చేశాను క్ష‌మించండి. ఇక మీద వ‌రుస సినిమాల చేస్తాన‌ని అభిమానుల‌కు మాట ఇచ్చింది పూజా హెగ్డె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -