Friday, April 19, 2024
- Advertisement -

అసెంబ్లీలో పోసానికి ఏం పని..?

- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ చేసిన.. స్పైడర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ టైం తమిళ్ బాక్స్ ఆఫీస్ పై మహేష్ డైరెక్ట్ ఎటాక్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం మహేష్.. భరత్ అనే నేను సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

రాజకీయ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సీఎం గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ సెట్ లో పోసాని ఎదో పరధ్యానంలో వెరైటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన పక్కన జీవా- బెనర్జీ లు కూడా ఇందులో కనిపిస్తున్నారు. పోసాని పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోందని సమాచారం.

మొదటి సారి తన గురువును బంధువును దర్శకుడు కొరటాల ఈ సినిమాలో చుపించాబోతున్నాడు. కొరటాల.. పోసాని శిష్యుడే. ఆయన దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశాడు. అలాగే పోసానికి దగ్గరి బంధువు కూడా.. ఇప్పటివరకు మూడు బాక్స్ ఆఫీస్ హిట్స్ తీసిన కొరటాల ఆ సినిమాల్లో పోసానికి ఏ పాత్ర ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -