ప్రముఖ నటుడు , రచయిత పోసాని కృష్ణమురళి ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని గత రాత్రి మీడియాలో వార్తలు వచ్చాయి. పోసాని నడవలేని స్థితికి చేరుకున్నారట. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారని సమాచారం. హైదరాబాద్లో యశోద ఆస్పత్రిలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఆయనకు అత్యవసర సర్జరీ కూడా చేశారని తెలుస్తోంది. అయితే పోసానికి అసలు ఏమైందో మాత్రం డాక్టర్లు బయటకు చెప్పడం లేదు.
ఆయన నటుడుగా , రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్హీరోగా నటించిన టెంపర్ సినిమాలో ఆయన నటనకు అనేక అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. పోసాని రాజకీయాలలో కూడా యాక్టివ్గానే ఉంటారు. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో ఆయన కీలక సభ్యుడుగా కొనసాగుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా పోసాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబాకు ఓటు వేయకండని ప్రజలను కోరారు. పోసాని ఆరోగ్యంపై ఆయన అభిమానులు అందోళన చెందుతున్నారు. పోసానిపై వచ్చిన ఈ వార్తలపై ఆద్యా మీడియా ఎంక్వైర్వీ చేయగా , ఇవి ఊట్టి రూమర్సే అని తేలాయి. పోసాని అనారోగ్యానికి గురైయ్యాడనే దానిలో ఎటువంటి వాస్తవం లేదని ఆద్యా మీడియా చేసిని ఎంక్వైర్వీ తేలింది. ఆయన వైసీపీ తరుపున ప్రచారం చేయడానికి కూడా రెడీ అయ్యారని పోసాని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇలాంటి వార్తలను నమ్మకండని ఆయన బంధువులు తెలిపారు.
- Advertisement -
పోసాని ఆరోగ్య పరిస్థితి విషమం
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -