Saturday, April 20, 2024
- Advertisement -

దిశాని రేప్ చేసి చంపిన వాళ్లు చంపితే ఏం వస్తోంది ? : పోసాని

- Advertisement -

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య, రేప్ ఘటనలో నిందితులైన ఆ నలుగురు యువకులు పెద్ద క్రిమినల్స్ కాదంటూ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఉన్న ఎవడూ నీతిగా ఉండకుండా సమాజం నీతిగా ఉండాలంటే ఎలా ఉంటుంది. రేప్ చేశారు కాబట్టి చంపేయండి అంటే ఇప్పుడు ప్రయోజనం లేదు.

ఈ నలుగుర్నే చంపుతారు. ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు. మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాం. ఎలాంటి వాళ్లకు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఎలాంటి వారిని కోలుస్తున్నాం అనేది మనకు మనం ప్రశ్నించుకుంటే ఆన్సర్ వస్తోంది. వీళ్లతో పోలీస్తే దిశాని రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదనేది నా లెక్క. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు.

ఉరి వేస్తే చచ్చిపోతారు. కాని అవినీతి, అక్రమాలు, రేప్‌లు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థ నీతిగా ఉంటే క్రైమ్ జరగకుండా ఉంటుంది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశ రేప్, హత్యపై చాలా బాధపడుతున్నా.. అయితే అందరం బాధపడటం వల్ల ఉపయోగం ఉండదు. 90 శాతం మంది జనం కరెక్ట్‌గా లేదు. ఈ నలుగుర్నీ చంపేస్తే 130 కోట్ల మందిలో మార్పు రాదు. వ్యవస్థ మారితే అందర్లో మార్పువస్తోంది.

ముందుగా జనం మారాలి. డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు రేపిస్ట్‌ కంటే డేంజర్. ఈరోజు ఒక అమ్మాయిని చంపేశారని బాధ పడటం కాదు.. భారతదేశమే చనిపోతుంది. మనం మారితే సమాజం మారుతుందని పోసాని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -