దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జైపుర్లో ఘనంగా జరుగుతుంది. ఈ పెళ్లికి జైపుర్లోని ఓ ప్రముఖ హోటల్ను బుక్ చేశాడు రాజమౌళి. ఈ పెళ్లికి చేసిన హోటల్ సామర్థ్యం దాదాపు 500 ఏకరాలు ఉంటుందని తెలుస్తుంది. కార్తికేయ పెళ్లి కోసం టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు,ప్రముఖులు కూడా జైపుర్కు తరలి వెళ్లారు. జైపుర్లో వీళ్లను రిసీవ్ చేసుకోవాడినికి ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారట రాజమౌళి. ఇంకా చెప్పాలంటే కొడుకు పెళ్లిని నార్త్ సైడ్ వాళ్లు చేసుకునే విధాంగా చేస్తున్నాడు రాజమౌళి.
ఇక పెళ్లికి ఎంత మంది వచ్చిన అందరి కళ్లు మాత్రం ఆ ఇద్దరిపైనే ఉన్నాయి.వారు మరెవ్వరో కాదు టాలీవుడ్ హాట్ పెయిర్ ప్రభాస్-అనుష్క . రాజమౌళి కొడుకు పెళ్లి కోసం వీరు జైపుర్కు చేరుకున్నారు. ప్రభాస్కు బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో బాలీవుడ్ జనాలకు కూడా బాగానే ఫేమస్ అయ్యాడు ప్రభాస్. గతంలో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ మీడియా సైతం ఈ జంటపై ఫోకస్ పెట్టింది. పెళ్లిని కవర్ చేయడం మానేసి మరి ఈ జంట ఎక్కడ ఉంటే అక్కడ కెమెరాలు ప్రత్యక్షం అవుతున్నాయట.దానికి తగినట్లే ఎక్కడ చూసిన వీరిద్దరు కలిసే ఉంటున్నారని సమాచారం.
ఇక పెళ్లి రిసెప్షన్లో ప్రభాస్,అనుష్కలు రాజస్థానీ సంప్రదాయంలో డ్రెస్ వేసుకుని మరి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.పెళ్లికి వచ్చిన చాలమంది వీరిద్దరినే గమనిస్తున్నారట.అయితే వీరిద్దరు మాత్రం తమ మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని ,కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి రాజమౌళి కొడుకు పెళ్లిలో మాత్రం అనుష్క, ప్రభాస్లు స్పెషల్ ఎట్రాక్షన్గా మారారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
- Advertisement -
స్పెషల్ ఎట్రాక్షన్గా మారిన అనుష్క ,ప్రభాస్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -