Friday, March 29, 2024
- Advertisement -

అడవి శేష్‌ను బూతులు తిట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకు ?

- Advertisement -

నటిడుగా, దర్శకుడిగా అడివి శేష్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనిపై ప్రభాస్ ఫైన్స్ ఫైర్ అవుతున్నారు. బాహుబలి సినిమాకు సంబంధించి ఓ ఫంక్షన్ లో తాను మాట్లాడినప్పుడు.. ఆ మూవీ నిర్మాతలకు, దర్శకుడుకి అలానే పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పినట్లు చెప్పారు. ప్రభాస్ ఫంక్షన్ కి వచ్చి ఆయన పేరు చెప్పకుండా.. పవన్ కి థ్యాంక్స్ చెప్పడంతో కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.

అయితే అది కావాలని చేయలేదని.. స్టేజీపై తనకు అనిపించింది మాట్లాడేశానని చెప్పారు. పంజా మూవీ నిర్మాతలు, బాహుఅలి నిర్మాతలు ఒక్కరే కావడం వల్ల.. పంజాతోనే తన కెరీర్ టర్నింగ్ పాయింట్ కావడంతో.. అందులో ఛాన్స్ ఇచ్చినందుకు నిర్మాత శోభ యార్లగడ్డతో పాటు పవన్ కు థ్యాంక్స్ చెప్పినట్లు తెలిపారు. అయితే తొందరపాటులో ప్రభాస్ పేరు మరిచిపోయానని.. ఆ రోజు తన బ్రదర్ ఫోన్ చేసి చెప్పేంతవరకు తాను ఆ విషయాన్ని గుర్తించలేకపోయానని అన్నారు.

ఆ తర్వాత రోజు నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ పోన్ చేసి తిట్టేవారని గుర్తు చేసుకున్నాడు. అప్పుడూ కొంత బాధపడ్డానని.. ఇదే విషయం ప్రభాస్ వద్ద ప్రస్తావిస్తే.. దాన్ని ఆయన సీరియస్ గా తీసుకేలేదని అన్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అలా తిట్టడం కూడా తాను కూడా సీరియస్ గా తీసుకోలేదని.. వాళ్ళ ఉద్దేశం అర్దం చేసుకున్నానని చెప్పారు. కాగా నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో పాత ట్వీట్లను ఫ్యాన్స్ తొవ్వుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -