Wednesday, April 24, 2024
- Advertisement -

అభిమానులకి శుభవార్త చెప్పిన ప్రభాస్

- Advertisement -

కేవలం ‘బాహుబలి’ 2 పార్ట్స్ కోసమే దాదాపు ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ఈ సినిమా విడుదలైన తర్వాత అయినా సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతాడని అందరూ అనుకున్నారు. కానీ ‘బాహుబలి’ విడుదలై ఇప్పటికి రెండేళ్ల తరువాత ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు ప్రభాస్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తన అభిమానులకు ఒక శుభవార్తని తెలియజేశాడు.

తాను ఇక కొన్నాళ్ల పాటు హై బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతున్నాడు ప్రభాస్. “ఇంతకుముందు సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని మాట ఇచ్చాను. కానీ ఆ మాటమీద నిలబడలేకపోయాను. ఇప్పుడు అలాంటి మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల అయ్యేలా చూసుకుంటాను” అని చెప్పాడు ప్రభాస్. అంతేకాకుండా కనీసం ఒక ఐదేళ్ల పాటు అయినా పెద్ద సినిమాలకి దూరంగా ఉంటానని హామీ ఇచ్చాడు ప్రభాస్. “హై బడ్జెట్ సినిమా అంటే ప్రజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సినిమాకి అంత ప్రజర్ తీసుకోవాలి అని నేను అనుకోవడం లేదు” అని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -