Saturday, April 20, 2024
- Advertisement -

కొంచెం టచ్ లో ఉంటె చెప్తా అంటున్న ప్రభాస్

- Advertisement -

సాధారణం గా ఎక్కువ గా ఎవరితో మాట్లాడని ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ అంటే కాస్త ఇబ్బంది గా ఫీల్ అవుతాడు. మొదట నుంచి పెద్దగా మొహమాటస్తుడిగా నే అందరికీ పరిచయమైన ప్రభాస్ తో మాట కలపడం అంటే కష్టమే. ప్రభాస్ కూడా తన పని ఏంటో అంత వరకు మాత్రం చూసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఎప్పటి నుంచో తెలుగు యాంకర్ ప్రదీప్ ప్రభాస్ ని తన షో లో కి గెస్ట్ గా పిలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో ఏమో కానీ ప్రభాస్ కి కూడా షో కి వెళ్ళాలి అని ఉన్నా కొన్ని అనివార్య కారణాల వలన అది ఎప్పుడూ కుదరలేదు. అయితే ఈ విషయం పైన ఇటీవలే ప్రదీప్ ఒక క్లారిటీ ఇచ్చాడు.

“ప్రభాస్ నాకు ఈ సారి మాట ఇచ్చారు. కచ్చితం గా కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో కి వస్తాను అని అన్నారు. ఆయన తో కలిసి షూటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.” అని ప్రదీప్ చెప్పాడు. అయితే ప్రభాస్ ఈ షో ని సాహో ప్రమోషన్స్ టైం లో వాడుకోవాలని భావిస్తున్నాడట. ఇంతకు ముందు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ షో లో పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -