Thursday, April 25, 2024
- Advertisement -

మంచు విష్ణును ప్రభాస్ ఎందుకు కలిశాడు ?

- Advertisement -

టాలీవుడ్ డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మంచు వారింట సందడి చేశారు. మంచు విష్ణు ఇంటికి వెళ్లిన ప్రభాస్ వారితో సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. మరి మంచు విష్ణు ఇంటికి ప్రభాస్ ఎందుకు వెళ్లాడో తెలుసా ? వివారాల్లోకి వెళ్తే.. మాములుగా స్టార్ హీరో కలుసుకోవడం పార్టీలు చేసుకోవడం చూస్తూ ఉంటాం.

గతంలో కూడా రామ్ చరణ్, మహేష్ బాబు అలానే ఎన్టీఆర్, రామ్ చరణ్ తరుచుగా కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్, విష్ణు కలుసుకోవడం వలన ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విష్ణు పిలవగానే ప్రభాస్ వెళ్లడం ఇక్కడ ప్రభాస్ మంచితనం తెలుస్తోంది. నిజానికి మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.

గతంలో మంచు విష్ణు నటించిన ’దేనికైనా రెడీ’ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఇచ్చాడు. అలానే ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో మోహన్ బాబు కీలకపాత్ర పోషించారు. ఇలా మంచు ఫ్యామిలీకి ప్రభాస్ దగ్గరయ్యాడు. దీపావళి పండగ సందర్భంగా మంచు విష్ణు గ్రాండ్ పార్టి అరెంజ్ చేశాడు. తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ప్రభాస్ ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు విష్ణు. ఈ మేరకు అతని ఇంటికి వెళ్లి ప్రభాస్.. వారితో సరదా సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‍స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.

’నా సోదరుడు ప్రభాస్ తో చాలా రోజుల తర్వాత సరదగా గడిపాను. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చాలా హ్యాపిగా గడిచింది’ అని విష్ణు పేర్కొన్నాడు. మరోవైపు విష్ణు సతీమణి విరానికా కూడా ఈ ఫోటోలను షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ జాన్ అనే లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -