Friday, April 19, 2024
- Advertisement -

రాజ‌మౌళి శిష్యుడితో ప్ర‌భాస్ సినిమా చేస్తున్నాడా…?

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ న‌టిస్తుంది. ఈ సినిమా త‌రువాత జిల్ ఫేం రాధాకృష్ణ‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1962 కాలంనాటి సినిమాగా రూపొందిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంది.తాజాగా ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భాస్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీయ‌డానికి స్టార్ దర్శ‌కులు చాలామంది లైన్లో ఉన్నారు. కాని వారిని కాద‌ని కొత్త ద‌ర్శ‌కుల వైపు మొగ్గు చూపుతున్నాడు ప్ర‌భాస్‌.ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌గ్గ‌ర శి శిష్యుడిగా ప‌ని చేసిన కృష్ణ ,ప్ర‌భాస్‌ను క‌లిసి ఓ క‌థ‌ను వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ప్ర‌భాస్ ఈ కొత్త ద‌ర్శ‌కుడుతో ప‌నిచేయ‌డానికి రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట ప్ర‌భాస్‌. బాహుబ‌లితో వచ్చిన క్రేజ్‌ను అలాగే కొనసాగించాలని చూస్తున్నాడు ప్ర‌భాస్‌. అందుకే కొత్త ద‌ర్శ‌కుల‌తో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -