యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో క్రేజీ హీరోగా మారాడు ప్రభాస్. ఈ సినిమాకు ముందు ప్రభాస్కు 50 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. మిర్చి సినిమా సాధించిన 40 కోట్లే అత్యధికం. కాని బాహుబలి సినిమాతో ఏకంగా 2000 కోట్ల హీరోగా మారాడు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ కూడా ఒక్కసారిగా మారిపోయింది.
ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేయలంటే కనీసం 200 కోట్ల బడ్జెట్ ఉండాలి. 200 కోట్లు ఉంటేనే ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాకు మొదట 200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కాని ఇప్పుడు ఈ బడ్జెట్ మరో 50 కోట్లు పెరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణతో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించనున్నాడు ప్రభాస్. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో పాతకాలం సెట్లు, నిర్మాణ ఖర్చు 250 కోట్లు దాటుంతుందని సమాచారం. ఈ రెండు ఈ సినిమాలు కనుక హిట్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతనికి అయితే ప్రభాస్తో సినిమా చేయలంటే మినిమమ్ 200 కోట్లు చేతిలో పెట్టుకొవాల్సిందే.