Friday, April 19, 2024
- Advertisement -

ప్రభాస్ ఈ టైం కే ఎందుకు విలువ ఇస్తున్నాడు..చెప్మా..?

- Advertisement -

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఏం చేసినా సెన్సషనల్ అవుతుంది. బాహుబలి సినిమా తో ఓ రేంజ్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా లతో సెట్స్ మీద ఉన్నాడు.. ఒకటి రాధే శ్యామ్ కాగా మరొకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా.. మరొకటి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్. ఇటీవలే ఈ సినిమా కి సంబందించిన లుక్ ని టైటిల్ ని రివీల్ చేయగా ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ వెలువడిన సంగతి తెలిసిందే.. ఈరోజు 7 .11 నిమిషాలకు ఆదిపురుష్ నుంచి అప్ డేట్ వస్తుందని చిత్ర బృందం ప్రకటించగా అభిమానులు అందరు ఆసక్తి గా చూస్తున్నారు..

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మితమవుతున్న ఈ సినిమా లో విలన్ ఎవరో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.  రామాయణం ఆధారంగా రూపొందే ఈ పౌరాణిక చిత్రం జనవరి నుంచి సెట్స్ కు వెళుతుంది. రెండు నెలల్లోనే షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులకి ఎక్కువ సమయం పడుతుందట.

ఇక ఈ సినిమా పై అభిమానులు ఈ  7.11 సెంటిమెంట్ ఏంటి అని అడుగుతున్నారట.. అయితే ఇది ప్రభాస్ సెంటిమెంట్అని అందరు అనుకుంటున్నారు.. గతంలో కూడా ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి ఆగస్టు 18న ఉదయం 7 గంటల 11 నిమిషాలకు బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలో చెప్పిన సమయానికి డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ ని ప్రకటించి టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా ‘ఆదిపురుష్’ నుంచి మరో అప్డేట్  7.11 am కి రాబోతోందని ప్రకటించాడు. దీంతో ప్రభాస్ కి 7+1+1 = 9 సెంటిమెంట్ ఉందేమో అందుకే ఆ సమయానికి అప్డేట్స్ ఇస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాబోయే ఫస్ట్ లుక్ అభిమానులను ఈమేరకు సంతోష పరుస్తుందో చూద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -