Thursday, March 28, 2024
- Advertisement -

‘సైరా’ వేడుకని ప్రభాస్ కావాలనే మిస్ అయ్యాడా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా గా ప్రేక్షకుల వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాని నిర్మిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక ప్రమోషనల్ ఈవెంట్ ని నార్త్ ఇండియాలో ప్లాన్ చేశారు. ఈ వేడుకకి ‘బాహుబలి’ మరియు ‘సాహో’ సినిమాలతో బాలీవుడ్లో సైతం మంచి మార్కెట్ తెచ్చుకున్న ప్రభాస్ ని ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ ఆహ్వానించాడు. కానీ ‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పుడు ప్యారిస్ కి వెకేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ కావాలని ‘సైరా’ వేడుకకి వెళ్ళకుండా ఉండడానికి పారిస్ కి వెళ్లారని కొందరు పుకార్లు సృష్టించారు. నిజానికి ప్రభాస్ కి మెగాస్టార్ అంటే ఎనలేని గౌరవం. ‘సాహో’ ప్రమోషనల్ ఈవెంట్ ల సందర్భంలో కూడా చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. మరి అలాంటిది ‘సై రా’ ఈవెంట్ కి మాత్రం తప్పించుకొని తిరగాలని అని ఎందుకు అనుకుంటాడు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘సాహో’ సినిమా కోసం మరియు ప్రమోషన్ల కోసం బాగా కష్టపడిన ప్రభాస్ కొంత సేద తీరడానికి మాత్రమే యూరోప్ వెళ్లారని ‘సైరా’ సినిమా ప్రమోషన్స్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -