Friday, March 29, 2024
- Advertisement -

ఢీ నుంచి ప్రదీప్ ను ఎందుకు తీసేసారో తెలుసా ?

- Advertisement -

ఢీ షోకి ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఢీ 11 సీజన్లను కంప్లీట్ చేసుకుని 12వ సీజన్ లోకి అడుగుపెట్టింది. దాదాపు ఎంతో మందిని ఢీ షో డాన్సర్లను, డాన్స్ మాస్టర్లను చేసింది. సౌత్ లో ది బెస్ట్ డ్యాన్స్ షోగా ఢీకి స్పెషల్ క్రేజ్ ఉంది. అయితే కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా సుధీర్, రష్మీ రొమాంటిక్ కామెడీ.. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకి చాలా ప్లస్. ఢీ 10, ఢో జోడి సీజ్లకు ప్రదీప్ యాంకర్ గా చేశాడు. ఈ రెండు సీజన్లకు సుధీర్, రష్మీలు టీం లీడర్లుగా ఉన్నారు.

అయితే ఢీ 12వ సీజన్ ఢీ ఛాంపియన్స్ కు క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. ఢీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రదీప్ యాంకరింగ్, సుధీర్, రష్మీలు టీం లీడర్లు అని. కానీ ఈ సారి ప్లాన్ మార్చేశారు. ఢీ ఛాంపియన్స్ లో సుధీర్, రష్మీలు యాంకర్లుగా మారారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేకంగా పటాస్ రవి, వర్షిణిలు టీం లీడర్లుగా వచ్చారు. శ్రీముఖి బిగ్ బాస్ కు వెళ్లాక పటాస్ లో వర్షిణి యాంకర్ గా వచ్చి పడింది. అయితే అంతకు ముందు ఢీ జోడీకి వర్షిణి టీం లీడర్ గా ఉంది. అందుకే రవి, వర్షిణిలను టీం లీడర్లగా చేసి.. సుధీర్, రష్మీలను ఢీ ఛాంపియన్స్ యాంకర్లుగా చేశారు.

అయితే ఎవరు ఉన్నా లేకునా సుధీర్, రష్మీ మాత్రం ఉండాల్సిందే. వారిద్దరినీ తీసేస్తే షోకి ఉన్న క్రేజ్ తగ్గుతుందని ఈ సారి యాంకర్స్ గా పెట్టారు. సో కావాలనే ఈ షో నుంచి ప్రదీప్ ను తప్పించారనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే ప్రదీప్, రష్మీలు యాంకరింగ్ చేస్తే సుధీర్ కు కామెడీ చేసే ఛాన్స్ మిస్ అవుతుంది. అదే రష్మీ, సుధీర్ యాంకరింగ్ చేస్తే అది వర్కవట్ అవుతుందని ప్రదీప్ ను పక్కన పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -