Tuesday, April 23, 2024
- Advertisement -

ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రో చెప్పిన ప్ర‌కాష్ రాజ్‌

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. విజ‌యంపై ఎవ‌రి ధీమా వారికి ఉంది. అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవ‌రో చెప్పేశాడు న‌టుడు ప్రకాష్ రాజ్‌. తాజాగా ఆయ‌న ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ఏపీకి ముఖ్య‌మంత్రి ఎవ‌రు కాబోతున్నారో చెప్పేశారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రు చంద్ర‌బాబు అనుభ‌వాన్ని చూసి ఓటేశార‌ని, అప్పుడు, మోదీ వేవ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు కూడా క‌లిసి వ‌చ్చింద‌ని ప్ర‌కాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

ఇంత‌మంది మ‌ద్ద‌తు క‌లిపిన కూడా జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుకు మ‌ధ్య కేవలం 1% మాత్ర‌మే ఓట్ల తేడా వ‌చ్చింద‌ని తెలిపారు ప్రకాష్ రాజ్‌. అయితే చంద్ర‌బాబు త‌నపై ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశార‌ని, ప్ర‌జ‌ల్లో ఆయ‌న విశ్వాశాన్ని పొగొట్టుకున్నార‌ని ప్ర‌కాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ప్ర‌త్యేక హోదా గురించి చంద్ర‌బాబు అనేకసార్లు మాట మార్చ‌ర‌ని తెలిపారు. టీడీపీ ప్ర‌భుత్వంలో అవినీతి కూడా బాగా పెరిగింద‌ని, ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం అవినీతిని ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతు వ‌స్తోంది.

వైసీపీ ఈ ఐదేళ్ళలో ప్రతిపక్షంలో త‌న పాత్రను బ‌లంగా ప్రతి గడపకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు జగన్. దీని ప్రజల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నారు. అంతేకాకుండా బాబుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత మరియు ఎక్కువ మంది ప్రజల గాలి జగన్ వైపు కూడా వీస్తుండడంతో, జగన్ కూడా గెలుపు విశ్వాసంపై ధీమాగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. దీని బ‌ట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అంటూ తెల్చేశారు ప్ర‌కాష్ రాజ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -