Friday, April 19, 2024
- Advertisement -

కన్నడ హీరో తో సినిమా చేసే ఆలోచనలో ప్రశాంత్ ..?

- Advertisement -

కెజిఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ ఎవరో తెలిసిపోయింది.. బాహుబలి తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఈ సినిమా పై మొదటినుంచీ అందరికి అంచనాలు ఉన్నాయి.. ట్రైలర్ తోనే ఈ సినిమా ని ఓ రేంజ్ లో నిలబెట్టిన ప్రశాంత్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు.. ఇక అందరి ద్రుష్టి ఇప్పుడు రెండో పార్ట్ పైనే ఉంది. ఈ రెండో పార్ట్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుండగా ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..

ఈ సినిమా తో ఈ డైరెక్టర్ కి క్రేజ్ మాములుగా పెరగలేదు. యంగ్ హీరోలు అందరు ఈ డైరెక్టర్ తో చేయాలనుకునేవారు.. బాలీవుడ్ హీరోల దగ్గరినుంచి ఈ డైరెక్టర్ పిలుపు వస్తుంది.. కానీ ప్రశాంత్ ముందే టాలీవుడ్ కి ఓ సినిమా కమిట్ అయ్యాడట.. అయితే అది ప్రభాస్ తోనా, ఎన్టీఆర్ తోనా అన్నది ఇప్పుడు కొంత అయోమయంగాఉంది.. ప్రస్తుతం కెజిఎఫ్ 2 పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ డిసెంబర్ నుంచి దాదాపు ఖాళీనే. ఒకవేళ ప్రమోషన్స్ కోసం ఓ రెండు నెలలు కావాలనుకున్నా 2021 మార్చ్ నుంచి మాత్రం పక్కాగా అందుబాటులో ఉంటారు. అయితే దీని తర్వాత ఎవరితో చేస్తారనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడటం లేదు. నిన్నటి నుంచి డార్లింగ్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ ఉంటుందని త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

కానీ ఇటు ఎన్టీఆర్ తో సినిమా అంటూ ఓ ప్రచారం జరుగుతుంది… లుగు హీరోల బర్త్ డేలకు ఎవరికీ విష్ చేయని ప్రశాంత్ నీల్ ఒక్క తారక్ కు మాత్రమే స్పెషల్ గా ట్వీట్ చేశాడు. అంటే మూవీ చేయబోతున్నట్టేగా అని అందరికీ అర్థమయ్యింది. ఇప్పుడు సీన్ లోకి రామ్ చరణ్ వచ్చాడు.. RRR తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా ని ఒప్పుకోలేదు.. ప్రశాంత్ కోసం ఏ సినిమా ని ఒప్పుకోలేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రశాంత్ మనసులో ఏముందో తెలీట్లేదు..అతను మళ్ళీ కన్నడ హీరో తోనే సినిమా చేశాడా లేదా టాలీవుడ్ హీరో తో సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -