Thursday, April 25, 2024
- Advertisement -

కట్టప్పతో వర్షంలో నడుస్తున్న మెగా హీరో

- Advertisement -

ఈ మధ్యనే ‘చిత్ర లహరి’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్న మెగాహీరో సాయిధర్మతేజ్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగే’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుప్రీం సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా ఈ సినిమాలో మెగా హీరోతో రొమాన్స్ చేయనుంది. సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సాయి ధరంతేజ్ మరియు సత్యరాజ్ వర్షపు నీళ్లలో ఆనందంగా కనిపిస్తారు.

ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సుప్రీం’ సినిమా తర్వాత ఇన్నాళ్లకు సాయిధర్మతేజ్ మరియు రాశిఖన్నా కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా కాబట్టి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -