Friday, March 29, 2024
- Advertisement -

పుకార్లపై స్పందించిన పృథ్వి రాజ్

- Advertisement -

గత కొంతకాలంగా ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణ మురళి మరియు కమెడియన్ పృథ్వి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లో విలేకరులతో మాట్లాడుతూ పృధ్వి ఈ పుకార్లపై స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని పోసాని కృష్ణ మురళి తనకు సోదరుడి వంటి వాడని పృద్వి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఛానల్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు తాను కూడా కృషి చేస్తానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకు వెళతాను అని చెప్పుకొచ్చారు పృథ్వి.

తనను చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన పృధ్వి చైర్మన్గా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఛానల్ కీర్తి ప్రతిష్టలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇక ఛానల్ లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడుతూ, ఇది ఎవరి పైన కక్ష సాధింపు చర్య కాదని అన్నారు. తాను కూడా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇరవై రోజుల గా అక్కడే ఉంటున్నానని ఎవరైనా అక్రమాలు చేసి ఉంటే వాటి రుజువులు తో చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పృథ్వి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -