Friday, March 29, 2024
- Advertisement -

డబుల్ ఇస్మార్ట్ – టైటిల్ రిజిస్టర్ చేసిన పూరి

- Advertisement -

సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ హీరో రామ్ కలయిక లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. అయితే సినిమా విజయానికి అందరికన్నా ఎక్కువ పూరి గురువు అయిన రామ్ గోపాల్ వర్మ ఎక్కువ సంతోషపడుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ తనదైన శైలి లో ట్వీట్స్ వేసి సినిమా మీద బజ్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. సినిమా కి కావాల్సిన రేంజ్ లో హైప్ కూడా క్రియేట్ చేసాడు. ఇక నిన్న సినిమా పెద్ద విజయం సాధించింది అని తెలుసుకున్న వర్మ వెంటనే దీని గురించి ట్వీట్ చేశాడు.

“పూరి జగన్,రామ్.. నేను హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ వస్తున్నాను. మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం. మీరు త్వరగా ఇస్మార్ట్ శంకర్ కి రెండో భాగం చేయండి. డబుల్ ధిమాఖ్ బదులు ఈ సారి ట్రిపుల్ ధిమాఖ్ అని టైటిల్ పెట్టండి.” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయగా, దానికి పూరి వెంటనే రెస్పాండ్ అయ్యారు.

“సర్ నేను ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాను.” అని పూరి జగన్ వర్మ కి బదులిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -