Friday, April 19, 2024
- Advertisement -

శృతి హాస‌న్‌ని పీవీపీ బ్లాక్ మెయిల్ చేశారా..?

- Advertisement -

నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆయ‌న రాజ‌కీయాల్లోకి దిగిన సంగ‌తి అందరికి తెలిసిన విష‌య‌మే. విజ‌య‌వాడ నుంచి ఎంపీ అభ్య‌ర్ధిగా వైసీపీ పార్టీ త‌రుపున నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. అయితే ఆయ‌న‌పై టీడీపీ అభ్య‌ర్థి కేశినేనిన నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌ని ఆయ‌న బ్లాక్ మెయిల్ చేశారని కేశినాని ఆరోపించారు. శృతి హాస‌న్‌న్ని బెదిరించి మ‌రి ఆమె , కాల్ షీట్లు తీసుకున్నారని ఆయ‌న అన్నారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఆయన ఏడిపించారని, మహేశ్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇతనంటే అసహ్యయించుకున్నార‌ని కేశినాని తెలిపారు.

పొట్లూరి వరప్రసాద్ పెద్ద క్రిమినల్, ఒక మోసగాడు, న‌మ్మించి గొంతు కొస్తాడ‌ని నాని విమర్శించారు. ఆయ‌నపై సీబీఐ కేసు కూడా ఉంద‌ని , చిన్న‌ప్ప‌టి నుంచే నేరాలు చేయ‌డం అలవాటుగా మార్చుకున్నార‌ని చెప్పుకొచ్చారు. కెనరా బ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. జగతి పబ్లికేషన్స్ లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని అన్నారు. అటువంటి వ్య‌క్తిని నాపై పోటీకి దించార‌ని ఎద్దేవ చేశారు కేశినాని నాని. మ‌రి నాని చేసిన విమ‌ర్శ‌ల‌పై పీవీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -