Tuesday, April 23, 2024
- Advertisement -

స‌ర్జ‌రీ చేసుకున్న స‌ఖి న‌టుడు

- Advertisement -

సఖి సినిమాతో అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న న‌టుడు మాధ‌వ‌న్‌. తన నవ్వుతోనే అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాడు. అప్పట్నించి భాషా బేధం లేకుండా తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తెలుగు సినిమాల్లో క‌నిపిస్తూనే ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మాధ‌వ‌న్ దూర‌మ‌య్యాడు. ఈ స‌మ‌యంలో నాగ‌చైత‌న్య సినిమాలో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అయితే మాధ‌వ‌న్‌కు స‌ర్జ‌రీ ఇటీవ‌ల జ‌రిగింది. ఎందుకు జ‌రిగింది? ఏమైంది అనే విష‌యాలు సోష‌ల్ మీడియాలో మాధ‌వ‌న్ పంచుకున్నారు. మాధవన్ భుజానికి శ‌స్త్ర‌చికిత్స జరగ‌డంతో ఆస్ప‌త్రి బెడ్ పై పడుకున్న ఫొటోను మాధవన్ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.

‘భుజానికి ఆపరేషన్ జరిగింది. ఫైటర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. కుడి చేతి స్పర్శ మాత్రం ఇంకా తెలియడం లేదు’ అని చెబుతూ ఫొటోను పోస్టు చేశాడు. ప్రస్తుతం మాధవన్ తెలుగులో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. మాధవన్‌కు జోడిగా భూమిక కీలకపాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఏమాయ చేశావే ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాలో కూడా మాధవన్ నటించబోతున్నాడు. ఏమాయ చేశావే సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. గౌతమ్‌తో మాధవన్ 2001లో చెలి చిత్రంలో నటించారు. మళ్లీ వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల త‌ర్వాత ఈ సినిమా రాబోతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -