Friday, March 29, 2024
- Advertisement -

బాహుబ‌లిని మించి RRR ఉంటుంది – రాజ‌మౌళి

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఇండియాలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన హీరోగా నిలిచాడు ప్ర‌భాస్. బాహుబ‌లి సినిమా త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జ‌క్క‌న్న‌కు RRR సినిమా గురించిన ప్ర‌శ్న‌లు ఎదురైయ్యాయి. చెప్ప‌ను , చెప్ప‌ను అంటునే బాహుబ‌లి RRR సినిమా ఏమాత్రం బాహుబ‌లి సినిమాకు త‌గ్గ‌ద‌ని చెప్పుకొచ్చాడు.

RRR సినిమా గురించిన అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుడంటంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కు వెళ్లాడు. సినిమాలో ఇప్ప‌టి వ‌రకు హీరోయిన్ల ఎంపిక జ‌ర‌గ‌లేదు. సినిమాలో బాలీవుడ్ హీరోయిన్స్‌ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న అలియా భ‌ట్‌ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. సినిమాను 2020లో విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -