బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా రేంజ్తో పాటు,దర్శకుడి రాజమౌళి క్రేజ్ కూడా పెరిగింది.ఈ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా RRR(వర్కింగ్ టైటిల్).ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ను రెగ్యులర్గా మొదలుపెట్టారు.తాజాగా ఈ సినిమాను ఫైటింగ్ సీన్స్తో మొదలు పెట్టాడు రాజమౌళి.ఈ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తుంది.ఇద్దరు హీరోల ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని, ఫైట్ సీన్స్ తీసేందుకు ఏకంగా 120 కెమెరాలను రాజమౌళి తెప్పించారట. ఈ కెమెరాల్లోని టెక్నాలజీతో వచ్చే ఎఫెక్ట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలలో జరుగుతుంది.సినిమా కథలో భాగంగా కొంత భాగం అడువుల్లో చిత్రికరించనున్నారట.ఇక బాహుబలిలో కిలి కిలి భాషలాగా ఈ సినిమాలో కూడా కొత్త భాషను పెట్టాలని భావిస్తున్నాడు రాజమౌళి.ఈ సినిమాలో హీరోయిన్లగా కీర్తి సురేష్ కియారా అద్వానీలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై అధికారిక ఎటువంటి ప్రకటన చేయలేదు చిత్ర యూనిట్.