Thursday, March 28, 2024
- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీ వారి వ‌ల్ల నాశ‌నం అవుతుంది – ర‌కుల్‌

- Advertisement -

టాలీవుడ్‌లో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ భామ అన‌తి కాలంలోనే స్టార్ హీరోల సినిమాల‌లో ఛాన్స్ కొట్టేసింది.మ‌హేశ్‌,ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌,అల్లు అర్జున్ సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించింది ర‌కుల్‌.అయితే ప్ర‌స్తుతం ర‌కుల్ హవా కాస్తా త‌గ్గింద‌ని చెప్పాలి.ఆమెకు తెలుగులో ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేవు.తాజాగా ఆమె ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు..తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం నాలుగు ఫ్యామిలీ చేతుల‌లో ఉంద‌ని,వారు ఏం చెబితే అదే అక్క‌డ న‌డుస్తుంద‌ని చెప్పి పెద్ద సంచ‌ల‌నానికే తెర లేపింది.టాలీవుడ్‌లో నాలుగు పెద్ద కుటుంబాల‌కు చెందిన వ్య‌క్తులు టాలీవుడ్‌ను రూల్ చేస్తార‌ని,వారికి తెలియ‌కుండా అక్క‌డ ఏం జ‌ర‌గ‌ద‌ని చెప్పుకొచ్చింది.

మ‌రి రకుల్ చెప్పిన నాలుగు ఫ్యామిలీలు ద‌గ్గుబాటి సురేష్ బాబు,దిల్ రాజు,అల్లు అర‌వింద్‌,నంద‌మూరి ఫ్యామిలీ అని అనుకుంటున్నారు.మ‌రి బిజినెస్ రంగంలోకి వ‌చ్చిన మ‌హేశ్ బాబుని కూడా లెక్క‌లోకి తీసుకుంటే ఐదు ఫ్యామిలీలు అనేది ఏమో అంటున్నారు నెటిజ‌న్లు.ర‌కుల్ చేతిలో ప్ర‌స్తుతం తెలుగు సినిమాలు లేక‌పోవ‌డంతోనే ఆమె ఇలాంటి కామెంట్స్ చేసింద‌ని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -