Thursday, April 25, 2024
- Advertisement -

అతిధులుగా మారిన రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్‌

- Advertisement -

మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌లు చాలా రోజుల తరువాత వేదిక‌పై క‌నిపించి మెగా అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. అయితే వీరిద్ద‌రు ఒక వేదిక‌పై కాకుండా వేర్వేరు వేదిక‌పై క‌నిపించ‌నున్నారు. రెండు సినిమాల‌కు వీరిద్ద‌రు ముఖ్య అతిథులుగా వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. ఈ ఆదివారం జరగనునున్న శర్వానంద్‌ ‘పడి పడి లేచె మనసు’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి అల్లు అర్జున్‌ అతిథి.

ఆ మర్నాడు జరగనున్న వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి రామ్‌చరణ్‌ అతిథిగా రానున్నార‌ని తెలుస్తుంది. ఈ రెండు చిత్రాల వేడుకలకు అల్లు అర్జున్, రామ్‌చరణ్‌ అతిథులుగా రావడం హీరోల మధ్య ఎటువంటి ఇగోలు లేవ‌న‌టానికి ఇదే నిద‌ర్శ‌నం అంటున్నారు మెగా ఫ్యాన్స్‌. ఈ రెండు చిత్రాలూ ఈ నెల 21న విడుదల కావ‌డం విశేషం.మ‌రి రెండు చిత్రాల‌లో ఏ హీరో మ‌ద్ద‌తు ఇచ్చిన‌ సినిమా విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -