తెలంగాణలో రాష్ట్రంలో ఓటింగ్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 30% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన ఓటును వినియోగించకోవడం లేదని తెలుస్తుంది. సినిమా షూటింగ్లో ఉండటం వల్లే రామ్ చరణ్ ఓటు వేయలేకపోయారని అని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ నిమిత్తం రామ్ చరణ్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు.
దీని కారణంగానే ఆయన ఓటు వేయలేకపోయారని ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ వారి చిన్న కూతురు శ్రీజలు జుబ్లీహిల్స్లోని పోలీంగ్ బుత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరో అల్లు అర్జున్,ఎన్టీఆర్, మహేశ్ బాబుశ్రీకాంత్ ,నాగబాబు,నిహారిక,వరుణ్ తేజ్లతో పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.