రంగస్థలం వంటి హిట్ తరువాత మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ.ఈ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.దీపావళి కానుక సినిమా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ను విడుదల చేశారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ రోజే విడుదల చేయడంతో పాటు సినిమాలోని ఫ్యామిలీ పోస్టర్ను కూడా విడుదల చేశాడు బోయపాటి.ఈ పోస్టర్లో రామ్ చరణ్తో పాటు ఒకప్పటి హీరోలు ప్రశాంత్,ఆర్యఎన్ రాజేష్లు కనిపించారు.
ఇక హీరోయిన్ స్నేహ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇలా పోస్టర్స్ ద్వారా తమ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయాని చెప్పకనే చెబుతున్నాడు బోయపాటి. ఈ సినిమాలో హీరోయిన్గా భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.