Thursday, March 28, 2024
- Advertisement -

సై రా వివాదం.. రామ్ చరణ్ మౌనం

- Advertisement -

ఆదివారం నాడు రామ్ చరణ్ ఆఫీస్ ముందు కొంత మంది మనుషులు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబీకులు అని చెప్పుకుని వచ్చి గొడవ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ సై రా నరసింహ రెడ్డి సినిమా కోసం తమ సంతకాలు తీసుకొని, ఆర్థికం గా ఆదుకుంటాం అని చెప్పి మొహం చాటేశారు అని వాళ్ళు వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో అసలు ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా కానీ చరణ్ ఎందుకు మౌనం గా ఉన్నారు అనేది అంతు చిక్కడం లేదు. మెగాస్టార్ సినిమా మీద ఇంతటి రాద్ధాంతాన్ని తోలి దశ లోనే అంతం చేసి ఉండాల్సింది అని కొందరు అనుకుంటున్నప్పటికీ దీని పై ఎవరూ స్పందించడానికి రెడీ గా లేరు.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తాము నరసింహ రెడ్డి కుటుంబీకులం అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు. నరసింహ రెడ్డి కి ముగ్గురు భార్యలు, ఆయన కుటుంబం చాలా పెద్దది. ఈ నేపథ్యం లో కొంత మంది సంబంధం లేకపోయినా వచ్చి అనవసరం గా గొడవ చేస్తున్నారట. అందుకే చర్మం మౌనం గా ఉన్నారని తెలుస్తుంది. అలాగే వారు వేస్తున్న అభియోగాల్లో కూడా నిజం లేదట. ఈ విషయమై అవతలి వాళ్ళు కోర్టు కి వెళ్లినా సినిమా కి వచ్చే నష్టం ఏమి లేదంటున్నారు విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -