Friday, March 29, 2024
- Advertisement -

తెరమీద మరో సార సందడి చేయనున్న తండ్రీ, కొడుకు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సైరా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన 152 వ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతున్నది. ఈసినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటి వరకు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా గురించి ఇంకో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించనున్నారట. దీనిలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావించారట. కొరటాల శివ అతిధి పాత్ర గురించి చరణ్ తో చర్చించారని, ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా ఒకే చెప్పారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు

గతంలో మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో మెగాస్టార్, చరణ్ తో స్క్రీన్ పై కనిపించారు. ఇద్దరు కలిసి నటిస్తే ఇది నాలుగో సినిమా అవుతుంది. ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే . ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల మాత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారట .

చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -