Thursday, April 25, 2024
- Advertisement -

మరో సెన్సేషనల్ బయోపిక్ కి వర్మ రంగం సిద్ధం..!!

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ పిప్పరమెంట్ తిన్నంత ఈజీ గా సినిమా లు చేస్తుండడం సినిమా వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఒక సినిమా తీయడానికి నెలలు నెలలు ఒక్కో డైరెక్టర్ కష్టపడుతుంటే వర్మ మాత్రం కెమెరా పట్టుకుని అలా వెళ్లి ఇలా ఓ సినిమా చేసి తన OTT లో అప్లోడ్ చేస్తున్నాడు.. సంచలనాలకు, వివాదాలకు మారుపేరు అయినా వర్మ సినిమాలు ఎక్కువగా నిజజీవిత కథలే అన్న సంగతి అందరికి తెలుసు.. ఆయన చేసిన ఒక్క శివ సినిమా తప్పా అన్ని నిజజీవిత కథలే.. ఇప్పటికీ అయన ఆ సినిమా లు చేస్తూ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తున్నారు..

ఇటీవలే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ వంటి సినిమాల్తో వర్మ పేరు మార్మోగిపోతోంది.. ఇక అమృత, మారుతీ రావు ల  జీవిత కథలతో మర్డర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇలా ట్రేండింగ్ టాపిక్ ఏదుంటే దాంతో సినిమా తీసి జనల అటెన్షన్ ని తన మీద ఉండేలా చూసుకుంటున్నాడు.. ఇక తాజాగా మరో సంచలన సినిమా కి వర్మ రంగం సిధ్దం చేస్తున్నాడని ఓ వార్త షికార్లు చేస్తుంది.  ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ‘139 మంది రేప్ కేసు’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీరిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ మరియు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సంచలనంగా మారిన ఈ కేసుపై అందరూ ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.  అయితే వర్మ మాత్రం ఈ కథను మొత్తం తెలుసుకుని దీనిపై ఓ సినిమా చేయడానికి ప్లాం చేశారట.. ఈ 139 మందిలో టీవీ సినీ జర్నలిజం వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం వల్ల ఈ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చని వర్మ భావిస్తున్నారట. స్టోరీ లేకుండానే సినిమా తీసే వర్మకు ఇప్పుడు ఇదే పెద్ద స్టోరీ అనిపించేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే రామ్ గోపాల్ వర్మ దీనిపై ట్వీట్ చేసే వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -