Thursday, April 18, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ కోసం బండి మీద సినిమాకెళ్తున్న వర్మ

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించడం తో గత మూడు నాలుగు రోజులు గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పూరి జగన్నాథ్ కి విపరీతం గా హైప్ ఇస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ కి వచ్చి మరీ ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకుంటున్నాడు వర్మ. అయితే తనకి నచ్చినట్టు ట్వీట్స్ వేసే వర్మ ఈ రోజు ఒక ఆసక్తికర ట్వీట్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఆయన బండి మీద మాస్ వేషం వేసుకొని తన శిష్యులతో కలిసి మూస పెట్ లో సినిమా చూడటానికి వెళ్తున్నట్టు ప్రకటించాడు.

‘ఆర్‌ఎక్స్‌ సినిమా చేసిన దర్శకుడు అజయ్‌ భూపతి, నా లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా ని చేసిన దర్శకుడు అగస్త్య మంజులతో కలిసి నేను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్‌లో మాస్ వేషాలు వేసుకొని సినిమా చూడబోతున్నాం. అంతే కాదు బైక్ మీద సినిమాకి వెళ్తున్నాము.” అని ఆయన ట్వీట్ చేయడం ఆసక్తి ని సంతరించుకుంది.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. పీసీ కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ ల పై ఈ సినిమా ని పూరి మరియు ఛార్మి నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -