Friday, April 19, 2024
- Advertisement -

రామ్ తో రీమేక్ సెట్ చేస్తున్న ఆ దర్శకుడు

- Advertisement -

కిషోర్ తిరుమల రైటర్ గా అందరి మెప్పును పొందిన తరువాత నేను శైలజ అనే సినిమా తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. రామ్, కీర్తి సురేష్ ఈ సినిమా లో ప్రధాన పాత్ర లు పోషించారు. ఈ సినిమా ఘాన విజయం తరువాత కిషోర్ తిరుమల మరల రామ్ తోటే ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా చేశాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ముగిసింది. ఆ తరువాత కిషోర్ తిరుమల సాయి దరం తేజ్ తో చిత్రలహరి సినిమా తీసి హిట్ కొట్టారు.

ప్రస్తుతం వినిపిస్తున్న ఫిలిమ్ నగర్ పుకార్ల ప్రకారం రామ్ పోతినేని కిషోర్ తిరుమల మరలా మూడో సారి ఒక సినిమా కోసం పనిచేయనున్నారు అట. తమిళం లో ఇటీవలే తధం అనే సినిమా విడుదల అయింది. అరుణ్ విజయ్ హీరో గా వచ్చిన ఈ సినిమా ని స్రవంతి మూవీస్ బ్యానర్ తెలుగు లో రిలీజ్ చేయాలి అని భావిస్తున్నారు అట. రామ్ అయితే బావుంటాడు అని అనుకున్న స్రవంతి రవి కిషోర్ తమకు బాగా కలిసి వచ్చిన కిషోర్ తిరుమల ని దర్శకుడిగా పేట్టి ఈ సినిమా ముగించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికీ అయితే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు కానీ ఇశ్మార్ట్ శంకర్ విడుదల అయ్యే సమయానికి ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -