Saturday, April 20, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు.. ఇతను గురించి మీకు తెలుసా ?

- Advertisement -

ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అనీల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక నటించగా.. ముఖ్యపాత్రలో విజయశాంతి నటించింది. అయితే ఈ సినిమాలో ’రమణ లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడుద్ది’ అంటూ డైలాగ్స్ చెప్పి పవర్ఫుల్ ఫైట్ లో ఓ పెద్దాయన మెరిశాడు.

ఈ పెద్దాయన పేరు కుమనన్ సేతురామన్. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉండే సేతురామన్ చెన్నై నుంచి వైజాగ్ కి 1984 వ సంవత్సరం లో వచ్చారు. ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమట.. సినిమాలు చేయాలనే కోరిక ఉండేదట..సినీ ఇండస్ట్రీ కి వెళ్లి మెంబెర్ షిప్ కార్డు తీసుకున్నారుట! ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలగ్ ని సరిగ్గా చెప్పా లేకపోయాడట.

ఇది చూసి నవ్వినా సేతురామన్ ను డైరెక్టర్ పిలిచి చెప్పమన్నారట. ఆ డైలాగ్ వేంటనే సేతురామన్ చెప్పడంతో వెంటనే సేతురామన్ ఆ సినిమాకి తీసుకున్నారట. అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదట. చాల సినిమా లలో విలన్ గా చేసారు..అరవింద్ 2 లో కూడా కనిపించారు. సురేందర్ రెడ్డి గారి సైరా సినిమా రూపం లో ఛాన్స్ దక్కింది. ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూ లో కుడా చేసారు. ఈ సినిమాలో అతని పాత్రకు మంచి పేరు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -