హీరోయిన్ స్వాతి చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చకుంది.ఇటీవల కమెడీయన్ అలీతో ఓ టీవి ప్రోగ్రామ్లో పోల్గోంది.ఆ ప్రోగ్రాంలో రామ్గోపాల్ వర్మ గురించి ఆశక్తికరమైన విషయం ఒకటి చెప్పడం జరిగింది.రాంగోపాల్ వర్మ ట్వీట్లు, ఆయన మాటలు చూసి జనాలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయనకి ఆడవాళ్ల పిచ్చి అని ఒక ఇమేజ్ పడిపోయింది. కానీ ఇన్నేళ్ల కెరియర్లో ఏ హీరోయిన్ కూడా వర్మ గురించి చెడుగా మాట్లాడలేదు.
ఆర్జీవీ అడ్డగోలుగా మాట్లాడినట్లు అనిపించినా..వ్యక్తిగా హి ఈజ్ జెంటిల్మెన్. ఆ విషయాన్ని హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా ధృవీకరించింది.అందులో వర్మ గురించి చేసిన కామెంట్ ఆసక్తికరం. ఆయన వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉంది ఆమె మాట.వర్మ సినిమాల్లో నటించారు కదా ఆ ఎక్స్పీరియెన్స్ గురించి చెప్పండి అని ఆలీ అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఇది: “నేను ఇప్పటివరకు చేసిన దర్శకుల్లో ఎలాంటి ఇబ్బందిపెట్టని గొప్ప దర్శకుడు వర్మ. నన్ను ఆయన రేవతితో పోల్చారు. నటన విషయంలో ఎక్కువ థింక్ చేయకుండా నేచురల్గా యాక్ట్ చేయమని సలహా చెప్పారు. ఆయన తన గీతనెప్పుడూ దాటలేదు. హి ఈజ్ జెంటిల్మెన్.”