ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.బాహుబలి సినిమా తరువాత ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించింది రమ్యకృష్ణ.దీంతో రమ్యకృష్ణకు భారీ డిమాండ్ ఏర్పడింది.అమ్మ రోల్స్, అత్త రోల్స్ చేస్తు బిజీగా మారింది.ప్రస్తుతం ఆమె నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి సినిమా తెచ్చిన క్రేజ్ తో దర్శకనిర్మాతలు రమ్యకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా గనుక హిట్ అయితే ఇక రమ్యకృష్ణకి తిరుగుండదు.
పారితోషికం విషయంలో కూడా ఆమె టాప్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందని తెలుస్తోంది. రోజువారీ డేట్స్ కాటాయిస్తే ఒక్కో రోజుకి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.దీంతో హీరోయిన్లు కన్నా రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎక్కువ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట.అయినప్పటికి ఆమె కావలని పట్టుబట్టి మరి తీసుకుంటున్నారట దర్శక-నిర్మాతలు.