Friday, April 26, 2024
- Advertisement -

రానా మౌనం దేనికి సంకేతం?

- Advertisement -

గత కొంత కాలం గా మీడియా లో రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించిన వార్తలు వస్తున్న విషయం మనకి తెలిసిందే. రానా కి కిడ్నీ సరిగా పని చేయడం లేదని, అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశారని వార్తలు మీడియా లో విపరీతం గా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం పై అటు రానా కానీ, రానా మేనేజర్ కానీ, సురేష్ బాబు కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. అసలు రానా కి నిజంగా నే ఆరోగ్యం పాడైందా అనే సందేహం కూడా అందరికీ తలెత్తుతుంది.

రానా ఆరోగ్యం చెడిపోయిందని వార్తలు వచ్చినప్పుడు కూడా రానా మౌనం గా నే ఉండిపోయాడు. ఆ తర్వాత రానా అమెరికా వెళ్ళాడు అన్నప్పుడు,ట్విట్టట్ లో అభిమానులకి అలాంటి వార్తలు పట్టించుకోవద్దు అని చెప్పిన రానా తాజాగా సర్జరీ విజయవంతం అనే వార్తలు వస్తున్న తరుణం లో ఇంస్టాగ్రామ్ లో డియర్ కామ్రేడ్ సినిమా గురించి మాట్లాడుతూ కనిపించాడు.

అదేంటో గానీ రానా మౌనం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. రానా మౌనం యొక్క ఆంతర్యం తెలిస్తే అన్నా ఒక క్లారిటీ వస్తుంది కానీ రానా మౌనం గా ఉంటూ ఏం సాధిస్తారు అనే వార్తలు హోరెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -