సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ను బాలకృష్ణ పోషిస్తున్నాడు. మొదట ఈ బయోపిక్కు దర్శకుడిగా తేజను అనుకుంటే ఆయన స్థానంలో క్రిష్ వచ్చి చేరాడు. క్రిష్ రావడంతో ఈ బయోపిక్ క్రేజ్ మారిపోయింది.బయోపిక్ లో పాత్రల కోసం స్టార్ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. తద్వారా సినిమాపై హైప్ మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నుండి విద్యాబాలన్ ను రప్పించారు.
ఇప్పుడు ఈప్రాజెక్ట్ లోకి దగ్గుబాటి రానా కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రానా ఈ బయోపిక్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మరో స్టార్ హీరో మహేష్ బాబుని కూడా ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఒప్పించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో స్టార్ నటీనటులను తీసుకుని సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు క్రిష్.