సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్, సమంత జోడీగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం’. పల్లెటూరి నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా మార్చి 30వ తేదీని థియేటర్లోకి వస్తోంది. అయితే దానికి ముందుకు సినిమాలోని మూడు పాటలు ‘ఎంత సక్కగున్నావే’, ‘రంగ రంగస్థలాన’, ‘రంగమ్మ మంగమ్మ’ విడుదల చేశారు. ఆ పాటలు మాస్తో పాటు అందరి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ పాటలతో పాటు మరి రెండు పాటలు వచ్చేశాయి.
ఇప్పుడు ‘ఆ గట్టునుంటావా నాగన్న’ అంటూ నాగన్న స్టెప్పులు వేస్తుండగా ‘జిగేలు రాణి’ అంటూ పూజాహెగ్డేతో పాదం కలపడానికి చిట్టిబాబు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మొత్తం ఐదు పాటలతో గురుఆవరం (మార్చి 15)రోజు యూట్యూబ్లో జ్యూక్బాక్స్ విడుదలయ్యింది. అయితే ఈ పాటలతో పాటు ఇంకో పాట కూడా ఉందంట.
అయితే ఈ సినిమాలో ఆ ఆరో పాటను ఇప్పుడే విడుదల చేయడం లేదు. ప్రత్యేక గీతం కావడంతో దాన్ని సినిమాలో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఆ పాటను విడుదల చేయలేదు. మరి అంత ప్రత్యేకమైన ఈ పాట మార్చి 30వ తేదీ నుంచి సినిమా థియేటర్లో విని చూడాల్సిందే.రంగస్థలంలోని సినిమా పాటలన్నీ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.