తెలుగులో చేసింది మూడే సినిమాలు అయినప్పటికి స్టార్ హీరోయిన్తో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. చేసిన మూడు సినిమాలను సూపర్ హిట్లుగా నిలిచింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచియం అయింది. తరువాత టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
ఈ సినిమాతో టాలీవుడ్ మొత్తన్ని తన బుట్టలో వేసుకుంది ఈ భామ. రష్మిక మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవలే ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మొదట ఫైట్తో మొదలైన ఈ టీజర్ చివర్లో లిప్ లాక్తో ముగుస్తుంది. దీంతో అందరు ఈ లిప్ లాక్ గురించి చెప్పుకుంటున్నారు. గతంలో కూడా వీరిద్దరు లిప్ లాక్లతో రెచ్చిపోయారు. మళ్లీ ఈ సినిమాలో కూడా లిప్ లాక్లకు కొదవ లేదని టీజర్ను చూస్తుంటే అర్థం అవుతోంది.
అయితే సినిమా కన్నా ఈ లిప్ లాక్ గురించే ఎక్కువ మాట్లాడుతుండటంపై అసహానం వ్యక్తం చేసింది రష్మిక. సినిమాలో లిప్ లాక్లే కాదు , మ్యాటర్ కూడా ఉందని దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. డియర్ కామ్రేడ్లో మంచి కథ కూడా ఉందని , సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది.