Saturday, April 20, 2024
- Advertisement -

మళ్లీ విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక

- Advertisement -

ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ‘గీత గోవిందం’ మరియు ‘డియర్ కామ్రేడ్’ సినిమాలలో నటించారు. ‘గీత గోవిందం’ సినిమాలో వారిమధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండటం వల్లనే వీరిద్దరి ‘డియర్ కామ్రేడ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ‘డియర్ కామ్రేడ్’ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం ‘హీరో’ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ త్వరలోనే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రష్మీక ని ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన ఈ మధ్యనే అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకి కూడా సైన్ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ తో సినిమా చేయడానికి ఆమెకు సమయం లేదని కొందరు చెబుతున్నారు కానీ పూరి మాత్రం ఈమెనే హీరోయిన్ గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. ఈ మధ్యనే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -