Tuesday, April 16, 2024
- Advertisement -

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం మాటలు నమ్మొచ్చా?

- Advertisement -

ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాల్సిన జగపతిబాబు సినిమా నుంచి తప్పుకున్నారు. దీనికి గల కారణం ఏంటా అని అనుమానాలు రేకెత్తిస్తున్న సమయం లో చిత్రబృందం దీని గురించి క్లారిటీ ఇచ్చింది.

జగపతిబాబు తనకు తానుగా సినిమాలో నుంచి తప్పుకోలేదని తామే కావాలని జగపతి బాబు స్థానంలో ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేశామని చెప్పుకొచ్చింది. గత కొంతకాలంగా ప్రకాష్ రాజు దిల్ రాజు ని సినిమాల్లో అవకాశం కోసం అడుగుతుండడం తో చేసేది లేక జగపతిబాబు పోషించాల్సిన పాత్ర ప్రకాష్ రాజు ఇచ్చినట్లు సమాచారం. అయితే చిత్ర బృందం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఒక కమర్షియల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రకోసం ప్రకాష్ రాజ్ ఒక్క చాన్స్ అంటూ అడగడమేమిటి అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -