Thursday, March 28, 2024
- Advertisement -

ఆ ఒక్క విషయం పై మౌనం వహిస్తున్న సాహో టీమ్

- Advertisement -

సాహో సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు సంతోషించారు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కొంత మంది సంగీత ప్రియులు మాత్రం చాలా కలం తర్వాత శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు లో కి ఎంటర్ అవుతున్నారు అనే సంతోషాన్ని వ్యక్త పరిచారు. వీరు కూడా సినిమా కోసం మంచి పాటలు చేసి పెట్టాలి అనే ధీమా తో నే సినిమా కోసం పని చేశారు. కొన్ని పాటలు స్వరపరచి రికార్డింగ్ కి సైతం పంపించారు. కానీ అనూహ్యం గా ఈ సంగీత త్రయం సినిమా నుండి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యం లో అసలు ఈ సినిమా కి ఎవరు సంగీతం వహిస్తారు అనే డవుట్స్ ఎక్కువ అయిపోయాయి.

నిన్న టీమ్ ఒక అధికారిక ప్రకటన చేసింది. అందులో జిబ్రాన్ సినిమా కి నేపథ్య సంగీతం అందిస్తారు అని చెప్పారు కానీ అసలు సినిమాకి ఆడియో ఎవరు స్వరపరుస్తున్నారు అనే విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా పాటలు హిందీ వాళ్ళు స్వరపరుస్తారు అని టాక్ వచ్చినా ఇప్పటి వరకు సుజీత్ కానీ నిర్మాతలు కానీ ఏ అనౌన్సమెంట్ ఇవ్వలేదు.

అయితే హిందీ వాళ్ళు మనకి స్వరపరిచిన ఆడియోల్లో ఒకటి కూడా విజయం సాధించింది లేదు. అందుకని ఈ సారి ప్రకటన చేసి ముందు నుండి నెగటివిటీ ని ఆకర్షించడం ఎందుకు అని నిర్మాతలు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -