Tuesday, March 19, 2024
- Advertisement -

తాప్సీ గేమ్ ఓవర్ కి ముహూర్తం ఖరారు

- Advertisement -

తాప్సీ పన్ను తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమ నటీమణుల్లో అగ్ర కథానాయిక. జుమ్మంది నాదం అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి ఆ పై అంచలంచెలుగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం పరుచుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ గేమ్ ఓవర్ అనే సినిమా లో నటించింది.

ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిన సంగతి తెలిసిందే. తాప్సీ ఈ సినిమా లో ఒక వీడియో గేమ్ డిజైనర్ లాగా కనిపించనుంది. మాయ అనే సినిమా ను నయనతార తో తీసి అందర్నీ మెప్పించిన అశ్విన్ ఈ సినిమా కి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ లో కూడా డబ్ అవుతుండడం విశేషం. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్స్ ఇటీవలే మొదలు అయ్యాయి. చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదలను ఖరారు చేసిన నేపథ్యంలో తాప్సీ పన్ను త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో బాగం గా హైదరాబాద్ మరియు చెన్నై లలో మీడియా తో మాట్లాడనుంది.

విక్రమ్ వేద, గురు వంటి సినిమాలను నిర్మించిన శశికాంత్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సినిమా ను నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -