నటుడు,నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఎన్నికల ముందు పలు టీవీ ఛానెల్లో ఇంటర్య్వూల మీద ఇంటర్య్వూలు ఇచ్చాడు బండ్ల గణేష్.రాజేంద్రనగర్ సీటు ఆశించి భంగపడ్డాడు బండ్ల.ఆ తరువాత అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ తరుపున ప్రచారం చేశారు.ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను గాంధీభవన్ సాక్షిగా బ్లేడ్తో నా పీక కోసుకుంటానని అని వాగ్దనం చేశారు.
ఎలెక్షన్ ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే గనుక గొంతు కోసుకుంటానని బహిరంగంగా కామెంట్స్ చేశాడు.అయితే ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎలెక్షన్స్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బండ్ల గణేష్ పై పడింది. తమ పార్టీ ఓడిపోతే గొంతు కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కనపడుటలేదు.. పేరు బండ్ల గణేష్.. వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.