Thursday, April 25, 2024
- Advertisement -

అమ్మ క‌డుపునే క‌డ‌పోళ్లు క‌త్తి ప‌ట్టుకొని పుడ‌తారు… వ‌ర్మ‌ వెబ్ సిరీస్

- Advertisement -
  • సంచ‌ల‌న వెబ్ సిరీస్ విడుద‌ల చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజంపై ఓ భ‌యంక‌ర సిరీస్‌ను మొద‌లెట్టాడు. ఫ్యాక్ష‌నిజంపైన ఆయ‌న‌కున్నంతా ఆస‌క్తి, క‌సి ఎవ‌రికీ ఉండ‌దు. ఫ్యాక్ష‌నిజం అది ఎక్క‌డిదైనా ఆయ‌న‌కు ఆస‌క్తి. విజ‌య‌వాడ అయినా.. గుంటూరైనా.. క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు ఇలా ఏ జిల్లాలో ఉన్నా త‌న కంట ప‌డితే చాలు వెంట‌నే ఆస‌క్తి క‌నబ‌రుస్తారు. దాన్ని క‌సితీరా.. ఎలా చంపారు.. ఎక్క‌డెక్క‌డా పొడిచాడు.. ఎందుకు అని ఇలా పూస‌గుచ్చి గుచ్చి మ‌రీ తెలుసుకొని తెలుసుకుంటారు.

మ‌ళ్లీ ఇప్పుడు క‌డ‌ప ఫ్యాక్ష‌నిజంపై ఇప్పుడు సినిమా కాకుండా ఏకంగా వెబ్‌ సిరీస్ మొద‌లెట్టాడు. ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’ అనే పేరు మీద వెబ్ సిరీస్ ప్రారంభిస్తూ ఫేస్‌బుక్‌లో ప్ర‌క‌టించి ప్రొమో విడుదల చేశారు. నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తానని వర్మ ప్ర‌క‌టించారు.

రాజారెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, బాంబుల శివారెడ్డి పేర్ల మీద వాళ్లు చెప్పిన ఫ్యాక్ష‌నిజం సూక్తులు ప్ర‌క‌టిస్తూ ‘చావు ఎప్పుడూ చెప్పి రాదు’ అంటూ భగవద్గీతలోని పదాలు చూపించి ట్రైల‌ర్ మొద‌లెట్టాడు. ‘కడప.. కడప..’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ‘రక్తచరిత్ర’ సినిమా మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ సిరీస్‌లో అన్నీ నిజ జీవిత ఘటనలను చూపిస్తున్న‌ట్లు గ‌ద్గ‌ద స్వ‌రంతో వాయిస్ ఓవ‌ర్ వ‌ర్మ ఇచ్చాడు. నటీనటులను కొత్త వాళ్లనే తీసుకున్నారు. ఎన్‌అండ్‌ఎన్‌ క్రియేషన్స్‌, ఏ కంపెనీ ప్రొడక్షన్స్ ఆధ్వ‌ర్యంలో ఈ సిరీస్ వ‌స్తోంది.

https://www.youtube.com/watch?v=6UJjBrBiGbA

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -