Thursday, April 25, 2024
- Advertisement -

చిరు సిగ్గు పడ్డారు.. కానీ నేనే రెచ్చిపోయా : రోజా

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, రోజా ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇక అప్పట్లో చిరంజీవితో కలిసి రోజా వేసిన చిందులు, రొమాంటిక్ సాంగ్స్.. ఆ హుషారు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. రోజా- చిరు కాంబోలో వచ్చిన సాంగ్స్ మాత్రం ఇప్పటికీ హోరెత్తిస్తూనే ఉన్నాయి.

అయితే ఆయా పాటలు చిత్రీకరిస్తున్నప్పటి సంగతులను చెబుతూ ఓపెన్ అయింది రోజా. ‘ముఠామేస్త్రీ’ సినిమాలో చిరంజీవితో చిందేస్తూ యమ కిక్కిచ్చిన ఆమె.. తాజాగా వాటి వెనుక ఉన్న రహస్యాలు చెప్పింది. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘అనుకున్నదొకటి అయ్యిందొకటి 2020’ అనే ప్రోగ్రాం చేశారు. ఇందులో రోజాతో పాటు శ్రీముఖి, హైపర్ ఆది, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి అంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా రోజా ఆ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.

”ఆ రోజుల్లో చిరంజీవితో డాన్స్ చేయడమంటే అదో సవాల్. ఆయనతో నాకు రొమాంటిక్ సాంగ్స్, ఈలలు వేసే మాస్ సాంగ్ కూడా పడ్డాయి. అదే సినిమాలో ‘మామా మామా’ అనే మాస్ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్ అయింది. ఆ సాంగ్ టైంలో చిరంజీవి రొమాంటిక్ షాట్ చేయడానికి సిగ్గుపడ్డారు. దాంతో అదే చిక్కిన ఛాన్స్ అని నేను రెచ్చిపోయాను. అందుకే ఆ సాంగ్ లో పొటాపోటీగా చిందులేశాము” అని చెప్పుకొచ్చింది.

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

అభిరామ్ నుంచి శ్రీరెడ్డి 6 కోట్లు తీసుకుందా ? శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?

రానా బావా.. అభితో నా పెళ్లి ఎప్పుడు : శ్రీరెడ్డి

వడ్డే నవీన్ ఇప్పుడే ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -