దర్మక ధీరుడు రాజమౌలి బాహుబలి వంటి హిస్టరికల్ సినిమా తరువాత తీస్తున్న సినిమా RRR(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారని మీడియా సమావేశంలో తెలిపారు రాజమౌళి. అయితే కొన్ని కారణలతో డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకుంది.
ఇప్పుడు ఆమె స్థానంలో హీరోయిన్ వెతికే పనిలో పడ్డాడు రాజమౌళి. ఈ క్రమంలో చాలామంది హీరోయిన్లు పేర్లు వినిపించాయి. బాలీవుడ్ నుండి శ్రద్ధ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ కొత్తగా ఈ లిస్ట్లో నిత్యామీనన్ పేరు బాగా వినిపిస్తోంది. దాదాపుగా నిత్యామీనన్ ఈ సినిమాలో ఖరారు అయిందని సమాచారం. నిత్యామీనన్ రోల్ సినిమాకు చాలా కీలకం కానుందట. అందుకే నిత్యామీనన్ వంటి యాక్టర్ ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఆలోచించాడట రాజమౌళి. ఈ చిత్రంలో ఓ గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ కనిపించనుందని సమాచారం.
అలియా భట్ రామ చరణ్ సరసన నటిస్తుండగా, నిత్యామీనన్ ఎన్టీఆర్కు జోడిగా కనిపించనుంది. ఎన్టీఆర్, నిత్యామీనన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ఎంతో కీలకం కానున్నాయని సమాచారం. ప్రస్తుతం RRR షూటింగ్కు కాస్తా బ్రేకులు పడ్డాయి. ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సినిమా షూటింగ్ను వాయిదా వేశాడు రాజమౌళి. అంతకముందు రామ్ చరణ్కు గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్కు గాయం కావడంతో సినిమా మరింత ఆలస్యం అవుతుంది.
- Advertisement -
RRRలో ఎన్టీఆర్కు జోడిగా నిత్యామీనన్ ఫిక్స్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -