Friday, March 29, 2024
- Advertisement -

రాంచరణ్ నిప్పు లా.. ఎన్టీఆర్ నీరులా ఎందుకు చూపించారంటే ?

- Advertisement -

ఈ కొత్త సంవత్సరాది రోజున సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. కరోనా నుంచి అందరి దృష్టి మోస్టే అవేటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వైపు మళ్లించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అంటూ ప్రకటించేసి అభిమానులను ఖుషీ చేశారు. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది.

అయితే ఈ మోషన్ పోస్టర్ లో గమనించని విషయం ఏంటంటే రాంచరణ్ ను నిప్పుతో ఎన్టీఆర్ ను నీరుతో కదిలే ఇద్దరు అగ్నిపర్వతాల వలే రాజమౌళి చూపించారు. ఇందులో పెద్ద లాజిక్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. అల్లూరి సీతారామారాజు పాత్ర పోషించిన రాంచరణ్ ను జక్కన్న నిప్పుతో చూపించారు. నిప్పు అర్థం ఏంటంటే విప్లవ వీరుడు అల్లూరిని ఆ పోరుబాటకు ప్రతీకగా అగ్నికణంగా రాజమౌళి తీర్చిదిద్దాడు. విప్లవానికి ప్రతీక నిప్పు ఎరుపు.. అందుకే చరణ్ ను ఆ కోణంలో ప్రజెంట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ను నీరుతో చూపించారు.

ఇలా ఎందుకు చూపించారంటే.. తెలంగాణలోని కొమురంభీం పోరాడిన కొమురం భీం జిల్లా జోడెఘాట్ కు వెళ్లాల్సిందే. నిజాం పాలకులతో పోరాడిన కొమురం భీం నినాదం ‘జల్ జంగల్ జమీన్’. అంటే నీరు అడవీ తమ ప్రాంతం.. వీటి కోసం కొమురం భీం తుపాకీ చేతపట్టి నిజాం రజాకర్లను ఎదురించారు. ఇందులో మొదటిది జల్ అంటే జలం కోసం. అందుకే కొమురం భీం పోరాట స్ఫూర్తిని తెలిసేలా ఎన్టీఆర్ ను జలంతో రగిలేలా రాజమౌళి చూపించారు. సో మోషన్ పోస్టర్ వెనుక ఉన్న రహస్యం అదినమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -